ముంబై లో విషాదం.. కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..
- March 15, 2019
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ టర్మినల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. సీఎస్టీలోని ప్లాట్ ఫాం నెంబర్-1 నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా సమీపంలోని బీటీ లేన్ ను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. సాయంత్రం బిజీగా ఉన్న సమయంలో పాదచారుల వంతెన ఒక్కసారిగా కూలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బ్రిడ్జ్ కూలిన ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంత రాయం ఏర్పడటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఇదిలా ఉంటే, ప్రమాదానికి గురైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రిపేర్ లో ఉన్నట్లు సమాచారం. ఉదయమే ఆ వంతెనకు మరమ్మతులు చేసినట్లు తెలు స్తోంది. రిపేరింగ్ పనులు పూర్తి కానప్పటికీ ప్రజలు ఆ వంతెనపై నుంచే వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!









