న్యూజిలాండ్లో కాల్పల కలకలం
- March 15, 2019
న్యూజిలాండ్లో కాల్పలు కలకలం సృష్టించాయి. క్రైస్ట్చర్చ్ నగరంలోని ఓ మసీదులో ఓ ఆగంతుకుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. నల్లరంగు బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపినట్టు స్థానికులు చెపుతున్నారు..
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ దాడి నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. టెస్ట్ సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. బంగ్లా క్రికెటర్లు అక్కడ నుంచి బయటపడ్డ సయంలోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







