ఒమన్ బోట్ ట్రాడెడీ: చివరి మృతదేహం లభ్యం
- March 15, 2019
మస్కట్: హృదయ విదారకమైన బోట్ యాక్సిడెంట్కి సంబంధించి చివరి మృతదేహాన్ని ఎట్టకేలకు అధికారులు కనుగొన్నారు. రాయల్ ఒమ్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. విలాయత్ ఆఫ్ మహౌత్ షోర్లైన్లో ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. మార్చి 8న ఆరుగురు ఒమనీ పౌరులు, వలాయత్ ఆఫ్ మహౌత్ మీదుగా ఫిషింగ్ ట్రిప్కి వెళ్ళారు. ఈ క్రమంలో బోటు మునిగిపోయింది. స్థానికంగా వున్నవారు ఈ ప్రమాదాన్ని గుర్తించి, ఇద్దర్ని రక్షించగలిగారు. అయితే మరో ఇద్దర్ని మాత్రం కాపాడలేకపోయారు, వారి మృతదేహాల్ని బయటకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, అందులో ఒకరి మృతదేహం బుధవారం దొరికింది. ఇప్పుడు మరో మృతదేహం దొరికిందని, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









