దుబాయ్ లో వైఎస్సార్సీపీ విజయోత్సవాలు
- May 26, 2019
దుబాయ్:ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దుబాయ్ లోని సోనాపూర్ బ్లూ డైమండ్ వర్కర్స్ క్యాంపు లో సంబరాలు నిర్వహించారు.యూ.ఏ.ఈ లో ఉన్న వైకాపా కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచుతూ.. నృత్యాలు చేస్తూ..సంబరాల్లో పాల్గొన్నారు.ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ స్థానాలు రావడంతో పార్టీ కేడర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.వైఎస్సార్సీపీ యూ.ఏ.ఈ NRI సెల్ తరపున రమేష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు పార్టీ MLA,MP లకు శుభాకాంక్షలు తెలిపారు.రమేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సక్సెస్ మరియు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ గురించి వివరించారు.
పవిత్ర రమదాన్ సంధర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి,సోమిరెడ్డి,కుమార్ చంద్ర,అక్రమ్,బ్రహ్మానంద రెడ్డి,రెడ్డయ్య,సుధాకర్ రావు,రమణ,దిలీప్,కోటేశ్వర్ రెడ్డి,జగదీశ్,హరీష్ ప్రభాకర్,నసీర్,శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







