దుబాయ్ లో వైఎస్సార్సీపీ విజయోత్సవాలు
- May 26, 2019దుబాయ్:ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దుబాయ్ లోని సోనాపూర్ బ్లూ డైమండ్ వర్కర్స్ క్యాంపు లో సంబరాలు నిర్వహించారు.యూ.ఏ.ఈ లో ఉన్న వైకాపా కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచుతూ.. నృత్యాలు చేస్తూ..సంబరాల్లో పాల్గొన్నారు.ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ స్థానాలు రావడంతో పార్టీ కేడర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.వైఎస్సార్సీపీ యూ.ఏ.ఈ NRI సెల్ తరపున రమేష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు పార్టీ MLA,MP లకు శుభాకాంక్షలు తెలిపారు.రమేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సక్సెస్ మరియు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ గురించి వివరించారు.
పవిత్ర రమదాన్ సంధర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి,సోమిరెడ్డి,కుమార్ చంద్ర,అక్రమ్,బ్రహ్మానంద రెడ్డి,రెడ్డయ్య,సుధాకర్ రావు,రమణ,దిలీప్,కోటేశ్వర్ రెడ్డి,జగదీశ్,హరీష్ ప్రభాకర్,నసీర్,శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం