యూఏఈలో వెదర్ వార్నింగ్ జారీ
- June 20, 2019
యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, రోడ్లపై డస్ట్ ఎక్కువగా బ్లో అయ్యే అవకాశం వుందంటూ పాదచారులకూ, వాహనాలు నడిపేవారికీ హెచ్చరికలు జారీ చేసింది. విజిబిలిటీ చాలా తక్కువగా వుంటుందనీ, ఇది 1,500 మీటర్ల కంటే తక్కువకు పడిపోతుందని, గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్లుగా నమోదవుతుందనీ, ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై వుండొచ్చు. ఉష్ణోగ్రతలు అంతర్గత ప్రాంతాల్లో 39 నుంచి 44 డిగ్రీల వరకు చేరుకుంటాయి. కోస్టల్ ఏరియాస్లో 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతుల వుండొచ్చు. మౌంటెయిన్స్లో 28 నుంచి 35 వరకు ఉష్ణోగ్రతలు వుంటాయని ఎన్సిఎం పేర్కొంది. హ్యుమిడిటీ అత్యధికంగా 60 నుంచి 80 శాతం వరకు కోస్టల్ ఏరియాస్లోనూ, 65 నుంచి 85 శాతం వరకు ఇంటీరియర్ రీజియన్స్లో, 50 నుంచి 70 శాతం వరకు మౌంటెయిన్స్లో వుండొచ్చు. కొన్ని చోట్ల గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశముంది. సముద్రం రఫ్ నుంచి వెరీ రఫ్గా మారొచ్చు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







