హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం...
- June 23, 2019శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాల గ్యాప్ తీసుకున్న నితిన్..తాజాగా భీష్మ చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుములు డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ ఈ మూవీ రూపుదిద్దుకోబోతుంది. ఈ చిత్రం సెట్స్ పైకి ఇంకా వెళ్లకముందే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తన 28 వ చిత్రాన్ని నితిన్ మొదలు పెట్టాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నితిన్ ట్విట్టర్ లో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 'నా 28వ సినిమాకి ముహూర్తం ఖరారైంది. చంద్రశేఖర్ యేలేటితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మొత్తానికి రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్లతో కలిసి పనిచేయబోతున్నాను. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..