హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం...
- June 23, 2019
శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాల గ్యాప్ తీసుకున్న నితిన్..తాజాగా భీష్మ చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుములు డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ ఈ మూవీ రూపుదిద్దుకోబోతుంది. ఈ చిత్రం సెట్స్ పైకి ఇంకా వెళ్లకముందే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టారు.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తన 28 వ చిత్రాన్ని నితిన్ మొదలు పెట్టాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నితిన్ ట్విట్టర్ లో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 'నా 28వ సినిమాకి ముహూర్తం ఖరారైంది. చంద్రశేఖర్ యేలేటితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మొత్తానికి రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్లతో కలిసి పనిచేయబోతున్నాను. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







