ఆగస్టు 23 న యూ.ఏ.ఈ విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ

- August 18, 2019 , by Maagulf
ఆగస్టు 23 న యూ.ఏ.ఈ  విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23-24 తేదీల్లో యూఏఈ మరియు ఆగస్టు 24-25 తేదీల్లో బహ్రెయిన్ కు విచ్చేయనున్నట్లు తెలిపిన భారత విదేశాంగ మంత్రి.

యూఏఈ పర్యటన లో భాగంగా  అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేస్తూ మోడీ విశిష్ట నాయకత్వానికి గుర్తింపుగా యూఏఈ యొక్క అత్యున్నత పౌర అలంకరణ అయిన 'ఆర్డర్ ఆఫ్ జాయెద్‌' ను కూడా మోడీ అందుకుంటారు. యూఏఈ వ్యవస్థాపక తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరిట ఈ అవార్డు షేక్ జాయెద్ పుట్టిన శతాబ్ది సంవత్సరంలో మోడీకి లభించినందున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది.బహ్రెయిన్ లో పర్యటించనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోడీ చరిత్రలో నిలవనున్నారు.  

--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com