ఎన్నారైల సంక్షేమానికి ఎంత కేటాయించారు?
- September 10, 2019హైదరాబాద్:2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను తేది: 22.02.2019న మరియు పూర్తి బడ్జెట్ ను తేది: 09.09.2019న ప్రవేశపెట్టారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే.. గత సంవత్సర బడ్జెట్ ప్రకారం కేవలం ఖర్చుల కొరకు మాత్రమే తాత్కాలిక / మధ్యంతర బడ్జెట్ కు ఆమోదం పొందడం అని అర్థం. అనుభవజ్ఞుల అభిప్రాయం ప్రకారం.. అంతకుముందు సంవత్సరం ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు, కాబట్టి తాత్కాలిక బడ్జెట్ లో అదే కొనసాగింపు ఉన్నదని భావించాలి. (ఆ 100 కోట్లు ఖర్చు చేయలేదన్నది వేరే విషయం)
అప్పటి తాత్కాలిక బడ్జెట్ లో ఎన్నారైల సంక్షేమానికి మొదటి త్రైమాసికానికి రూ.16 కోట్లు కేటాయించారని సమాచారం. ఇప్పుడు ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ లో పాతదానికి తోడు ఎంత అదనంగా కేటాయించారన్నది ఒక వారం వరకు స్పష్టత వస్తుంది.
బడ్జెట్ లో ఎంత కేటాయించినా... ఖర్చు చేయడానికి ఒక విధానం (పాలసీ) మరియు తగిన యంత్రాంగం లేకపోతె లక్ష్యం నెరవేరదు. కాబట్టి సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) లో భాగంగా 'తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేయాలి. దీనికోసం శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టి ఒక చట్టం చేయాలి.
-మంద భీంరెడ్ది
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్