అధ్యయనం పేరిట కాలయాపన వద్దు:మంద భీంరెడ్డి

- October 12, 2019 , by Maagulf
అధ్యయనం పేరిట కాలయాపన వద్దు:మంద భీంరెడ్డి

హైదరాబాద్:గల్ఫ్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో తన అభిప్రాయం తెలిపిన ప్రవాసి కార్మిక నాయకులు మంద భీంరెడ్డి.ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) ముసాయిదా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నది. అధ్యయనం పేరిట కాలయాపన వద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత అయిదు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో గల్ఫ్ దేశాలలో మృతి చెందిన 1261 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని కెసిఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. 

గల్ఫ్ లో ఉన్నవారిని వాపస్ తెప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలుపడం అనాలోచిత, బాధ్యతారాహిత్యం. సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండానే ప్రకటనలు చేయడం సరికాదు. అధికారుల బృందాన్ని కేరళరాష్ట్రానికి అధ్యయనానికి పంపడం కాలయాపన కొరకే. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో సమగ్ర ప్రవాసి సర్వే నిర్వహించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఎన్నారై ల కొరకు ప్రత్యేక శాఖను ఏర్పాటై చేయాలి. ఒక మంత్రిని నియమించాలి. తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, పెన్షన్, స్వయం ఉపాధి లాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com