అధ్యయనం పేరిట కాలయాపన వద్దు:మంద భీంరెడ్డి
- October 12, 2019హైదరాబాద్:గల్ఫ్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో తన అభిప్రాయం తెలిపిన ప్రవాసి కార్మిక నాయకులు మంద భీంరెడ్డి.ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) ముసాయిదా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నది. అధ్యయనం పేరిట కాలయాపన వద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత అయిదు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో గల్ఫ్ దేశాలలో మృతి చెందిన 1261 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని కెసిఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి.
గల్ఫ్ లో ఉన్నవారిని వాపస్ తెప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలుపడం అనాలోచిత, బాధ్యతారాహిత్యం. సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండానే ప్రకటనలు చేయడం సరికాదు. అధికారుల బృందాన్ని కేరళరాష్ట్రానికి అధ్యయనానికి పంపడం కాలయాపన కొరకే.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో సమగ్ర ప్రవాసి సర్వే నిర్వహించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఎన్నారై ల కొరకు ప్రత్యేక శాఖను ఏర్పాటై చేయాలి. ఒక మంత్రిని నియమించాలి. తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, పెన్షన్, స్వయం ఉపాధి లాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు