ఒమన్‌లో భారతీయ సినిమా చిత్రీకరణ

- February 10, 2016 , by Maagulf
ఒమన్‌లో భారతీయ సినిమా చిత్రీకరణ


ఒమన్‌లో ఓ భారతీయ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. మార్చ్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని మస్కట్‌కి చెందిన చిత్ర ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత తెలిపారు. 130 మంది సభ్యులు గల చిత్ర బృందం ముట్రాహ్‌, ఇబ్రి మరియు ఒమన్‌లోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతారని ఆయన అన్నారు. మానవీయ సంబంధాల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందని, భారతీయ తల్లికి జన్మించిన ఇరానియన్‌ బాలికకి సంబంధించిన కథ అనీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రెన్నీ జాన్సన్‌ అన్నారు. ఇండియన్‌ స్టేజ్‌, టెలివిజన్‌ మరియు ఫిలిం యాక్టర్‌ అదిల్‌ హుస్సేన్‌ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈయన 'రిల్యుక్టెంట్‌ ఫండమెంటలిస్ట్‌' మరియు 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రాల్లో నటించారు. శ్వేతా మీనన్‌ ఫిమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోందని, హాలీవుడ్‌ నటి రీమ్‌ కాదెమ్‌ మరో ముఖ్య పాత్రలో నటిస్తోందని మెజూన్‌ ట్రావెల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తెలిపారు. 'నావల్‌ ఎన్నా జ్యుయెల్‌' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కుతుంది. రెంజిల్‌ లాల్‌ దామోదరన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఒమన్‌లో మార్చ్‌ నెలాఖరు నుంచి 20 రోజులపాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com