తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ
- October 16, 2020
హైదరాబాద్:నేడు హైదరాబాదులోని అశోక్ నగర్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర బాధ్యులు ఈ సంవత్సరం రికార్డు చేసిన 8 సాంప్రదాయ బతుకమ్మ చప్పట్ల పాటల సీడీని ఆవిష్కరించారు. జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సూచన మేరకు రూపకల్పన చేసిన ఈ సీడీలోని పాటలను కవి, రచయిత కోదారి శ్రీను సేకరించగా ప్రముఖ గాయనిలు తేలు విజయ, పద్మావతి, వరం తదితరులు పాడారు. అలాగే మహిళలకు పాడుకోడానికి అనుకూలంగా ఉండేలా ఇప్పటి వరకు జాగృతి తయారు చేసిన సీడీలలోని బతుకమ్మ పాటలతో ముద్రించిన బతుకమ్మ పాటల పాకెట్ సైజ్ పుస్తకాలను కూడా ఆవిష్కరించారు.
అలాగే మూడు ప్రత్యేక బతుకమ్మ గీతాలను కూడా నేడు విడుదల చేసారు. దామోదర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఈ మూడు గీతాలకు రచన, సేకరణ కోదారి శ్రీను, సంగీతం వేణు, గానం తేలు విజయ, పద్మావతి, స్ఫూర్తి, వరం. ఈ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు మేడె రాజీవ్ సాగర్, వరలక్ష్మి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, కార్యదర్శి రజిత, హైదరాబాదు అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, రంగారెడ్డి అధ్యక్షులు అర్చన సేనాపతి, మేడ్చల్ అధ్యక్షులు ఈగ సంతోష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









