మలేషియా లో నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుతో మృతి
- November 21, 2020
కౌలాలంపూర్:నిజామాబాదు జిల్లా గూపన్ పల్లి గ్రామానికి చెందిన బాల రవీందర్ ఇటీవల మలేషియా జోహార్బారు లోని సుల్తానా అమీనా హాస్పిటల్లో గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం మృతిని భార్య బాల లక్ష్మి మరియు వారి సంబంధికులు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) అధ్యక్షుడు తిరుపతికి తెలియజేసారు.ఈ విషయం తెలిసిన వెంటనే మైట మైగ్రేట్ వింగ్ ప్రెసిడెంట్ ప్రతీక్ వారి సభ్యులు మలేషియా లోని ఇండియన్ ఎంబసీ తో ఆసుపత్రి తో మరియు వారి బంధువులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని ఈ రోజు 21/11/2020 రోజున వందే భరత్ మిషన్ ద్వారా స్పెషల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ ఫ్లైట్ లో హైదరాబాద్ శంషాబాద్ ఏర్పోర్ట్ కు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట ) విన్నపం మేరకు ఈ మృత దేహాన్ని హైదరాబాద్ పంపడానికి ఆయన మొత్తం ఖర్చు మలేషియా లోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించిందని మైట వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలియజేసారు. దీనికి సహకరించిన కోర్ కమిటీ మరియు మైట సబ్యులకు ఉపాధ్యక్షుడు సత్య కృతజ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









