కువైట్:మరోసారి తెరపైకి విదేశాలకు నగదు బదిలీపై పన్ను విధింపు అంశం
- February 19, 2021
కువైట్ నుంచి విదేశాలకు చేసే నగదు బదిలీపై పన్నులను విధించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అన్ని విదేశీ నగదు బదిలీలపై పన్నులను విధించటంపై స్పందించిన పార్లమెంట్ సభ్యుల కమిటీ...నగదు బదలీ పన్ను విధానాన్ని కేవలం ప్రవాసీయులకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేసింది. దేశ పౌరులు నిర్వహించే నగదు బదిలీలపై ఎలాంటి పన్నులు ఉండొద్దని అంటోంది. అయితే..విదేశాలకు నగదు బదిలీలపై పన్ను విధించే అంశంపై భిన్నాప్రాయాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను మంత్రి మండలి గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, జాతీయ అసెంబ్లీ, చట్టసభ్యుల కమిటీ విదేశాలకు నగదు బదిలీలపై పన్ను విధింపు విధానాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే..ఇది కేవలం ప్రవాసీయులకు మాత్రమే వర్తింప చేయాలని, అందులోనూ వివిధ వర్గాలను, నగదు బదిలీ అంశాలను బేస్ చేసుకొని పర్సేంటేజ్ ఆధారంగా పన్ను విధించాలని అంటోంది. ఈ పన్ను విధానం నుంచి దేశ పౌరులకు, విద్యార్ధులు, గృహకార్మికులకు మినహాయింపు ఇవ్వాలని తమ డిమాండ్లో చేర్చింది. అయితే..ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోంది. కువైట్ చట్టాలు, ఆర్ధిక విధానాల ప్రకారం ప్రవాసీయులకు నగదు బదిలీ పన్ను విధించటం సరికాదని అంటోంది.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







