కువైట్:మరోసారి తెరపైకి విదేశాలకు నగదు బదిలీపై పన్ను విధింపు అంశం
- February 19, 2021
కువైట్ నుంచి విదేశాలకు చేసే నగదు బదిలీపై పన్నులను విధించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అన్ని విదేశీ నగదు బదిలీలపై పన్నులను విధించటంపై స్పందించిన పార్లమెంట్ సభ్యుల కమిటీ...నగదు బదలీ పన్ను విధానాన్ని కేవలం ప్రవాసీయులకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేసింది. దేశ పౌరులు నిర్వహించే నగదు బదిలీలపై ఎలాంటి పన్నులు ఉండొద్దని అంటోంది. అయితే..విదేశాలకు నగదు బదిలీలపై పన్ను విధించే అంశంపై భిన్నాప్రాయాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను మంత్రి మండలి గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, జాతీయ అసెంబ్లీ, చట్టసభ్యుల కమిటీ విదేశాలకు నగదు బదిలీలపై పన్ను విధింపు విధానాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే..ఇది కేవలం ప్రవాసీయులకు మాత్రమే వర్తింప చేయాలని, అందులోనూ వివిధ వర్గాలను, నగదు బదిలీ అంశాలను బేస్ చేసుకొని పర్సేంటేజ్ ఆధారంగా పన్ను విధించాలని అంటోంది. ఈ పన్ను విధానం నుంచి దేశ పౌరులకు, విద్యార్ధులు, గృహకార్మికులకు మినహాయింపు ఇవ్వాలని తమ డిమాండ్లో చేర్చింది. అయితే..ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోంది. కువైట్ చట్టాలు, ఆర్ధిక విధానాల ప్రకారం ప్రవాసీయులకు నగదు బదిలీ పన్ను విధించటం సరికాదని అంటోంది.
తాజా వార్తలు
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!







