భారత్ లో కరోనా కేసుల వివరాలు

- May 02, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్‌లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కోవిడ్ కేసులు పైపైకి క‌దులుతూనే ఉన్నాయి.కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 3,92,488 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 3689 మంది కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందారు.ఇక‌,ఇదే స‌మ‌యంలో 3,07,865 మంది కోవిడ్ నుంచి కోలుకోవ‌డం శుభ‌ప‌రిణామంగా చెప్పుకోవాలి.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,57,457కు చేరుకోగా..రిక‌వ‌రీ కేసులు 1,59,92,271కి పెరిగాయి.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ బారిన ప‌డి 2,15,542  మంది మృతిచెంద‌గా..ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 33,49,644 గా ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది.మ‌రోవైపు..ఇప్ప‌టి వ‌ర‌కు 15,68,16,031 మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com