ట్యునీషియా: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
- July 26, 2021
ట్యునీషియా: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుడంతో.. పార్లమెంటు వెలుపల బారికేడ్లతో పాటు భారీ బలగాలను మోహరించారు. పార్లమెంట్ స్పీకర్, ఎన్నాథా పార్టీ నేత రాచ్ఘన్నైచిలను సోమవారం పార్లమెంట్లోకి ప్రవేశించకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున వీధుల్లో చేపడుతున్న నిరసన ప్రదర్శనలు..కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారాయి.కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని,ఆర్థిక సంక్షోభం నెలకొందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్లమెంటును రద్దు చేయడంతో పాటు టునిషియా ప్రధాని హిచెమ్ మిచిచిని అధ్యక్షుడు తొలగించిన సంగతి తెలిసిందే. కాగా, పార్లమెంట్ నిరంతరం సమావేశాలు జరుపుతుండగా..అధ్యక్షుడు సయీద్ పార్లమెంట్ రద్దు చేయడం చెల్లదని..ఆయన నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ఎన్నాథా పార్టీ పేర్కొంది.ప్రస్తుతం టునీషియాలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు టర్కీ విదేశాంగమంత్రి పేర్కొన్నారు.ప్రజాస్వామ్య ప్రభుత్వ పునరుద్ధరణ జరగాలని పిలుపునిచ్చారు. అలాగే జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా అడ్బెహర్ మాట్లాడుతూ.. ట్యునీషియాలో పరిస్థితులు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని జర్మనీ ఆశిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









