ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్లో ఉద్యోగాలు..
- September 05, 2021
ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్, లెక్చరర్ ఇన్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 06 ఖాళీలకు గాను ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్)–01, లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫెసర్),కాలేజ్ ఆఫ్ నర్సింగ్–05 ఖాళీలను భర్తీ చేయనుంది.
- ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు నర్సింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్వైఫ్లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు.
- లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్వైఫ్లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 50ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
- అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 నుంచి 2,08,700 జీతంగా చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,23,100 నుంచి 2,15,900 వరకూ చెల్లిస్తారు.
- అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు 14-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
- పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..
- ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ
- రాలీలో కన్నులపండువగా శ్రీ సీతారామ కళ్యాణం
- వన్యప్రాణుల సంరక్షణలో భారత్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి









