ఇండియన్ పోస్టల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు..
- October 03, 2021
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ పోస్టల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటా ద్వారా తీసుకోనున్నారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 221 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ (72), పోస్టుమ్యాన్ (90), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (59) ఖాళీలు ఉన్నాయి.
- పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100వరకు జీతంగా చెల్లిస్తారు.
- పోస్ట్ మ్యాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ 59,100 జీతంగా చెల్లిస్తారు.
- మల్టీ టాస్కింగ్ పోస్టులకు అప్లై చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏడీ (రిక్రూట్మెంట్), సీపీఎంజీ, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్, న్యూఢిలీ – 110001 అడ్రస్కు పంపించాలి.
- అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
- దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి (04-10-202) ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 12-10-2021గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







