సౌదీ వెలుపల వుంటే, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలు ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా మారవు
- October 04, 2021
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్), వ్యక్తిగత అవసరాల కోసం సొంతంగా పని వెతుక్కునే క్రమంలో అక్రమంగా వెళ్ళే వలసదారులకు 50,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వలసదారుడు జైలు శిక్ష పూర్తి చేసుకున్నాక, జరీమానా పూర్తిగా చెల్లించాక దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. కంపెనీలు, వర్కర్లకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఈ హెచ్చరికల్ని జవజాత్ చేయడం జరిగింది. ఎగ్జిట్ మరియు ఎంట్రీ వీసా చెల్లుబాటు గడువు ముగిశాక ఆరు నెలల తర్వాత అబ్షెర్ సిస్టంలోంచి డొమెస్టిక్ వర్కర్స్ తొలగించబడతారు. అలా జరగకూడదంటే తవాసుల్ ద్వారా కమ్యూనికేట్ చేయాల్సి వుంటుంది వీసా గడువు తీరిన 30 రోజుల్లోగా. దేశం వెలుపల సదరు వ్యక్తులు వుంటే, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలు ఫైనల్ ఎగ్జిట్ వీసాలుగా మారబోవు. ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసా ద్వారా సౌదీ విడిచి వెళ్ళి, గడువు తీరే లోపు సౌదీకి చేరకపోతే, అలాంటివారిపై మూడేళ్ళ నిషేధం వుంటుంది. అంతకు ముందు ఎంప్లాయర్ ద్వారా కొత్త వీసా పొందితే వారికి వెసులుబాటు వుంటుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







