భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- October 06, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,833 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 278 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,75,656 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,49,538 మంది మృతి చెందారు. దేశంలో 2,46,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 92,17,65,405 మందికి టీకాలు వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com