ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం..
- November 07, 2021
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమిపై హత్యాయత్నం జరిగింది. దాడి విఫలమవడంతో క్షేమంగా బయటపడ్డారు ప్రధాని. దాడిలో ఐదుగురు గాయపడ్డారు. దీంతో వీరిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అత్యంత భద్రత నడుమ ఉండే ప్రధాని ముస్తఫా నివాసంపై తెల్లవారుజామున డ్రోన్ దాడి చేశారు దుండగులు. డ్రోన్ దాడితో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని ముస్తఫాను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత భద్రత నడుమ గ్రీన్ జోన్లో ఉండే ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి జరగడంపై ఇరాక్ ఆర్మీ అలర్టయింది. దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ప్రకటన చేయలేదు. తాను క్షేమంగా ఉన్నాట్లు చెప్పారు ఇరాక్ ప్రధాని ముస్తఫా. దేశ ప్రజలంతా శాంతియుతంగా, సంయమనంతో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







