‘రాధేశ్యామ్’లో పరమహంసగా రెబల్ స్టార్!
- December 20, 2021
హైదరాబాద్: ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో ఓ యోగి పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించబోతున్నారన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. సినిమా షూటింగ్ చివరిలో చిత్రీకరణ జరుపుకుంది ఆయనకు సంబంధించిన సన్నివేశాలే అనే ప్రచారం కూడా జరిగింది. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న దానిని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం ఇప్పటికే పూర్తి చేసుకుందట. కానీ ఆ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే తాజాగా ఇందులో ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్ర పోషిస్తున్నట్టు ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
ఓ పక్క ఆల్ ఇండియా స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతుంటే మరో పక్క చడీ చప్పుడూ లేకుండా ఇలా కృష్ణంరాజు కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది చిత్ర బృందం.అందాల భామ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ పాటలు చార్ట్ బస్టర్స్ లో టాప్ పొజిషన్ లో నిలుస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఇదే పరిస్థితి. మరి సంక్రాంతి కానుకగా జనవరి 14న జనం ముందుకు వస్తున్న ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఇంకెన్ని విశేషాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









