కోవిడ్ 19: టెస్టింగ్ ఇకపై వుండకపోవచ్చు.!
- January 11, 2022
యూఏఈ: కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో చాలా మార్పులు జీవన శైలిలో వస్తున్నాయనీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, దాని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నాం గనుక, కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే.. కోవిడ్ 19తో మనం సహజీవనం చేయక తప్పదనే విషయం బోధపడుతుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ముందు ముందు కోవిడ్ టెస్టులతో ఉపయోగం వుండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణీకులు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదని అన్నారాయన. పాండమిక్ సమయంలో దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూతపడలేదనీ, అయితే కొన్ని ఆంక్షలు తప్పలేదనీ, ఇకపై అలాంటి ఆంక్షలు కూడా వుండాల్సిన అవసరం వుండదని చెప్పారు. కోవిడ్ భయాల నుంచి కోలుకుని, పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ కొనసాగుతున్న సమయంలో ఇంకో వేవ్ వచ్చిందనీ, దీన్ని సైతం సమర్థవంతంగా తట్టుకుని నిలబడుతున్నట్లు దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలతో పోల్చితే దుబాయ్ విమానాశ్రయ నిర్వహణ చాలా ప్రత్యేకమైనదని సీనియర్ అధికారి గ్రిఫిత్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







