ఎయిర్పోర్టులో వింగ్స్ ఇండియా – 2022
- March 24, 2022
            హైదరాబాద్: ఆసియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే వింగ్స్ ఆఫ్ ఇండియా గురువారం నుంచి ఆరంభం కానుంది. బేగంపేట ఎయిర్ పోర్టు వేదికగా వింగ్స్ ఆఫ్ ఇండియా-2022ను మార్చి 27 వరకు నిర్వహించనున్నారు.4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 24, 25 తేదీల్లో వ్యాపార వర్గాలకు మాత్రమే అనుమతి ఉండగా, సాధారణ ప్రజలకు 26, 27 తేదీల్లో లోనికి అనుమతిస్తారు.
రెండేళ్లకోసారి జరిగే వింగ్స్ ఇండియా ప్రదర్శన ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య, సాధారణ, పౌర విమానయాన ప్రదర్శనగా చెప్పుకొంటారు. ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MOCA), ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తుంది.
ప్రదర్శనలో భాగంగా విమానయాన రంగంలో పెట్టుబడుల ప్రకటనలు, ఒప్పందాలు, ప్రాంతీయ కనెక్టివిటీ, విమానయాన, హెలికాప్టర్లు, డ్రోన్ల వినియోగం, విమానయాన పరిశ్రమ దశ, దిశ మొదలైన వాటిపై చర్చలు జరుగుతాయి.
25న వింగ్స్ ఇండియా – 2022 ను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు పౌర విమానయాన రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి హోటల్ తాజ్ కృష్ణలో వింగ్స్ ఇండియా అవార్డుల ప్రదానం చేస్తారు. ఈవెంట్ లో భాగస్వాములు కానున్న విదేశీ ప్రముఖులు, రాయబారులు, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్పోర్ట్స్ ఏజెన్సీలు, సివిల్ ఏవియేషన్ అథారిటీలు, ఇంజినీరింగ్, కన్సల్టెంట్ వంటి ఏవియేషన్లోని వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
న్యూ హారిజోన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ థీమ్తో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తుంది. ప్రదర్శనలో 125 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. సారంగ్ బృందం ఎయిర్ షోలు ఆకట్టుకునేందుకు ముస్తాబయ్యాయి.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







