ఇమ్రాన్ ఖాన్ కు బుల్లెట్ ప్రూఫ్ భద్రతను కల్పించాలి: పాక్ ప్రధాని ఆదేశం
- April 25, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు దుండగుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తమ నేత ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇమ్రాన్ కు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణమే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ భద్రతను కల్పించాలని పేర్కొన్నారు.
ఈరోజు రాత్రి లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ ఒక ర్యాలీని నిర్వహించనున్నారు. ర్యాలీకి సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో, వర్చువల్ గా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాలని ఆయన మద్దతుదారులు కోరారు. వారి సూచనను ఇమ్రాన్ తిరస్కరించారు. ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆయన భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







