ఇమ్రాన్ ఖాన్ కు బుల్లెట్ ప్రూఫ్ భద్రతను కల్పించాలి: పాక్ ప్రధాని ఆదేశం
- April 25, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు దుండగుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తమ నేత ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇమ్రాన్ కు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణమే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ భద్రతను కల్పించాలని పేర్కొన్నారు.
ఈరోజు రాత్రి లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ ఒక ర్యాలీని నిర్వహించనున్నారు. ర్యాలీకి సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో, వర్చువల్ గా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాలని ఆయన మద్దతుదారులు కోరారు. వారి సూచనను ఇమ్రాన్ తిరస్కరించారు. ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆయన భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









