కువైట్ వెళ్లే ప్రవాసుల కోసం కొత్త రూల్..
- July 22, 2022
కువైట్ సిటీ: కువైట్ లోకి ప్రవేశించే ప్రవాసుల కోసం కొత్త రూల్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.కొత్తగా వర్క్, ఫ్యామిలీ వీసాలపై దేశానికి వచ్చే ప్రవాసుల పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) వెరిఫికేషన్ను ఇకపై ఆన్లైన్ ద్వారా చేయనున్నట్లు ప్రకటించింది.ఈ కొత్త రూల్ను మొదట భారత్తోనే ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది.ఆ తర్వాత మిగతా దేశాల వారికి విస్తరించనున్నట్లు పేర్కొంది.సెప్టెంబర్ను నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించింది.కువైట్ వెళ్లే భారతీయులు మొదట మన దగ్గర ఉండే ఆ దేశానికి చెందిన రాయబార కార్యాలయంలో పీసీసీ సర్టిఫికేట్ ఫారమ్ను సమర్పించాలి. మనం సమర్పించిన పీసీసీ ఫారమ్ను కువైట్ రాయబార కార్యాలయం పరిశీలిస్తుంది. క్రాస్ చెకింగ్ తర్వాత మాత్రమే చెల్లుబాటయ్యే స్పాన్సర్ను ధృవీకరించడానికి ఆన్లైన్లో కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది.ఇలా పీసీసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం ఆన్లైన్ ద్వారానే నిర్వహించనుంది.కనుక ఆగస్టు తర్వాత కువైట్ వెళ్లే భారతీయ ప్రవాసులు దీన్ని దృష్టిలోపెట్టుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం బెటర్.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







