14 మొబైల్ యాప్స్ పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
- May 01, 2023
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 14 మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్లుగా వీటిని ఉపయోగిస్తున్నారని కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. రక్షణ దళాలు, భద్రత, ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థల సూచన మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్లు బ్లాక్ చేయబడ్డాయి.
కేంద్రం బ్లాక్ చేసిన అప్లికేషన్లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్ మొదలగు యాప్స్ ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్లపై అణిచివేత కొత్తేమీ కాదు.. గతంలో కేంద్రం ప్రభుత్వం పలు చైనీస్ యాప్లను నిషేధించింది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 250 చైనీస్ యాప్లపై నిషేధం విధించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







