కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి : బాగ్దాద్
- May 11, 2016
కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన మూడు కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతిచెందారు. షీటే ప్రాంతంలో ఉదయం 10 గంటలకు ఓ మార్కెట్ సమీపంలో బాంబు పేలడంతో 64 మంది పౌరులు మరణించగా, మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది బాగ్దాద్లో చోటుచేసుకున్న దాడుల్లో ఇదే అతి పెద్ద దాడి. పేలుడు ధాటికి మార్కెట్లోని షాపులు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. ఖదీమియాలో జరిగిన పేలుడులో 14 మంది బలయ్యారు. పశ్చిమ బాగ్దాద్లోని జామీమియా లో చోటుచేసుకున్న మరో కారుబాంబు పేలుడులో 8 మంది చనిపోయారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









