కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి : బాగ్దాద్
- May 11, 2016
కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతి బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన మూడు కారు బాంబు పేలుళ్లలో 86 మంది మృతిచెందారు. షీటే ప్రాంతంలో ఉదయం 10 గంటలకు ఓ మార్కెట్ సమీపంలో బాంబు పేలడంతో 64 మంది పౌరులు మరణించగా, మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది బాగ్దాద్లో చోటుచేసుకున్న దాడుల్లో ఇదే అతి పెద్ద దాడి. పేలుడు ధాటికి మార్కెట్లోని షాపులు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. ఖదీమియాలో జరిగిన పేలుడులో 14 మంది బలయ్యారు. పశ్చిమ బాగ్దాద్లోని జామీమియా లో చోటుచేసుకున్న మరో కారుబాంబు పేలుడులో 8 మంది చనిపోయారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







