యూఏఈ లో పాఠశాలలు పునఃప్రారంభం. మొదటి రోజు భారీగా రద్దీ
- August 28, 2023
యూఏఈ: రెండు నెలల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సోమవారం ఉదయం యూఏఈలోని రోడ్లపై భారీ ట్రాఫిక్ నెలకొంది. షార్జా-దుబాయ్లను కలిపే ఇత్తిహాద్ రోడ్, అల్ తౌన్ రోడ్ మరియు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ వంటి అన్ని ప్రధాన రహదారులు సోమవారం స్కూల్ బస్సులతో ట్రాఫిక్ కనిపించింది. ఉదయం 6.40 గంటలకు సఫీర్ మాల్ నుండి అల్ ముల్లా ప్లాజాకు ఇత్తిహాద్ రోడ్లో ట్రాఫిక్ నత్త వేగంతో కదులుతున్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించాయి. అలాగే, చాలా పాఠశాలలు ఉన్న మువీలా, అల్ నహ్దా, అల్ ఖుసైస్, అల్ బర్షా మరియు ఇతర ప్రాంతాలను కలిపే రహదారులు చాలా రద్దీగా కనిపించాయి. రెండు నెలల వేసవి సెలవుల తర్వాత సోమవారం యూఏఈ అంతటా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో వాహనదారులు సకాలంలో కార్యాలయానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. చాలామంది కార్యాలయాలకు సకాలంలో చేరుకునేందుకు తొందరగా బయలుదేరినట్లు తెలిపారు. మరోవైపు ఆగస్టు 28ని 'ప్రమాదాలు లేని రోజు'గా డ్రైవ్ చేపట్టింది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. డ్రైవర్లు వారు ప్రమాదాన్ని నివారించి, ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడకపోతే, వారి డ్రైవింగ్ లైసెన్స్ నుండి నాలుగు బ్లాక్ పాయింట్లు క్లియర్ చేయబడతాయని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







