ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్

- September 27, 2023 , by Maagulf
ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్

అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో లోకేశ్ ను సీఐడీ A-14గా చేర్చడంతో కోర్టుకు వెళ్లారు.

తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తరువాత యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు లోకేశ్. ఆ తరువాత ఏపీలో జరిగిన పలు కీలక పరిణామాలతో ఢిల్లీ వెళ్లారు. ఓపక్క చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ అంటూ పలు అంశాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళుతున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు.

ఆ తరువాత లోకేశ్ మీడియాతో మాట్లాడుతు..అసలు వేయని రోడ్డు విషయంలో తనపై కేసు పెట్టారని..అసలు వేయని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను A14గా చేర్చారని.. సంబంధం లేని శాఖ అయినా తనపై కేసు పెట్టటం ఏంటీ ఇదే జగన్ ప్రభుత్వం చేసే పనులు అంటూ మండిపడ్డారు. నా తండ్రి అరెస్ట్ తరువాత తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ఇచ్చానని త్వరలోనే ప్రారంభిస్తానని ఎక్కడ నుంచి ఆపానో అక్కడ నుంచే ప్రారంభిస్తానని స్పష్టం చేశారు లోకేశ్. తాను పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించాక యాత్రను ఆపే కుట్రలో భాగంగా తనను A14గా చేర్చారు అంటూ విమర్శలు సంధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com