ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్
- September 27, 2023
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో లోకేశ్ ను సీఐడీ A-14గా చేర్చడంతో కోర్టుకు వెళ్లారు.
తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తరువాత యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు లోకేశ్. ఆ తరువాత ఏపీలో జరిగిన పలు కీలక పరిణామాలతో ఢిల్లీ వెళ్లారు. ఓపక్క చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ అంటూ పలు అంశాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళుతున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఆ తరువాత లోకేశ్ మీడియాతో మాట్లాడుతు..అసలు వేయని రోడ్డు విషయంలో తనపై కేసు పెట్టారని..అసలు వేయని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను A14గా చేర్చారని.. సంబంధం లేని శాఖ అయినా తనపై కేసు పెట్టటం ఏంటీ ఇదే జగన్ ప్రభుత్వం చేసే పనులు అంటూ మండిపడ్డారు. నా తండ్రి అరెస్ట్ తరువాత తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ఇచ్చానని త్వరలోనే ప్రారంభిస్తానని ఎక్కడ నుంచి ఆపానో అక్కడ నుంచే ప్రారంభిస్తానని స్పష్టం చేశారు లోకేశ్. తాను పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించాక యాత్రను ఆపే కుట్రలో భాగంగా తనను A14గా చేర్చారు అంటూ విమర్శలు సంధించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









