రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- December 22, 2025
విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించడమే కాకుండా, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన 48 రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మంధాన, తన అద్భుతమైన బ్యాటింగ్తో చరిత్ర సృష్టించింది.
టీ20లలో 4000 పరుగులు దాటిన రెండవ మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. నిన్న శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆమె ఈ ఘనతను సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 25 పరుగులు చేసిన స్మృతి ఈ రికార్డును నమోదు చేసింది. స్మృతి 154 మ్యాచుల్లో 4007 రన్స్ చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ జాబితాలో కివీస్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 పరుగులతో తొలి స్థానంలో ఉంది.
మొత్తం మీద టీ20 క్రికెట్లో పురుషులు, మహిళలు కలిపి ఐదుగురు మాత్రమే 4000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు బేట్స్, పాకిస్థాన్కు చెందిన బాబర్ ఆజం సహా స్మృతి ఈ జాబితాలో చేరింది. ఇక, ఈ జాబితాలో మంధాన అతి పిన్న వయస్కురాలు కావడంతో భవిష్యత్తులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









