పాలస్తీనియన్లకు మద్దతుగా కదిలిన దుబాయ్ నివాసితులు
- October 30, 2023
దుబాయ్: రెండవ తరహూమ్ ఫర్ గాజా ప్రచారంలో భాగంగా ఆదివారం దుబాయ్లోని ఫెస్టివల్ అరేనాలో ఆరు నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్సు గల వందలాది మంది వాలంటీర్లు వేలాది వినియోగ వస్తువులను ప్యాక్ చేయడానికి క్యూలో నిలబడ్డారు. యూఏఈ ఎయిడ్, దుబాయ్ కేర్స్ మరియు ఎమిరేట్స్ రెడ్క్రాస్ ప్రారంభించిన ప్రచారంలో అన్ని వర్గాల, జాతీయతలకు చెందిన ప్రజలు చేతులు కలిపారు. యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనియన్ల కోసం ప్రాథమిక ఆహారం, బిస్కెట్లు, చక్కెర, టూత్పేస్ట్, షాంపూ, పరిశుభ్రత కిట్లు, దుప్పట్లు మరియు ఇతర వినియోగ వస్తువులను ప్యాక్ చేయడానికి ముందుకువచ్చారు. పాలస్తీనియన్ల కోసం వేలాది ఎమర్జెన్సీ రిలీఫ్ కిట్లను ప్యాక్ చేయడానికి. అబుదాబిలోని ఎతిహాద్ అరేనా, షార్జాలోని అల్ బైత్ ముతావహిద్లో కూడా ఇలాంటి ప్రచారాలను ఆదివారం నిర్వహించారు. దుబాయ్ కేర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్దుల్లా అహ్మద్ అల్షెహి మాట్లాడుతూ.. వేలాది మంది వాలంటీర్లు ప్రచారం కోసం నమోదు చేసుకున్నారని చెప్పారు. మొదటి ఎడిషన్లో, మేము సుమారు 7,500 బాక్సులను ప్యాక్ చేసామని, ఈసారి వేల బాక్సులను కూడా ఆశిస్తున్నట్లు అల్షెహి చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







