పాలస్తీనియన్లకు మద్దతుగా కదిలిన దుబాయ్ నివాసితులు
- October 30, 2023
దుబాయ్: రెండవ తరహూమ్ ఫర్ గాజా ప్రచారంలో భాగంగా ఆదివారం దుబాయ్లోని ఫెస్టివల్ అరేనాలో ఆరు నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్సు గల వందలాది మంది వాలంటీర్లు వేలాది వినియోగ వస్తువులను ప్యాక్ చేయడానికి క్యూలో నిలబడ్డారు. యూఏఈ ఎయిడ్, దుబాయ్ కేర్స్ మరియు ఎమిరేట్స్ రెడ్క్రాస్ ప్రారంభించిన ప్రచారంలో అన్ని వర్గాల, జాతీయతలకు చెందిన ప్రజలు చేతులు కలిపారు. యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనియన్ల కోసం ప్రాథమిక ఆహారం, బిస్కెట్లు, చక్కెర, టూత్పేస్ట్, షాంపూ, పరిశుభ్రత కిట్లు, దుప్పట్లు మరియు ఇతర వినియోగ వస్తువులను ప్యాక్ చేయడానికి ముందుకువచ్చారు. పాలస్తీనియన్ల కోసం వేలాది ఎమర్జెన్సీ రిలీఫ్ కిట్లను ప్యాక్ చేయడానికి. అబుదాబిలోని ఎతిహాద్ అరేనా, షార్జాలోని అల్ బైత్ ముతావహిద్లో కూడా ఇలాంటి ప్రచారాలను ఆదివారం నిర్వహించారు. దుబాయ్ కేర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్దుల్లా అహ్మద్ అల్షెహి మాట్లాడుతూ.. వేలాది మంది వాలంటీర్లు ప్రచారం కోసం నమోదు చేసుకున్నారని చెప్పారు. మొదటి ఎడిషన్లో, మేము సుమారు 7,500 బాక్సులను ప్యాక్ చేసామని, ఈసారి వేల బాక్సులను కూడా ఆశిస్తున్నట్లు అల్షెహి చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







