తెలంగాణలో 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదు

- November 30, 2023 , by Maagulf
తెలంగాణలో 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్ర ఐదు గంటలకు ముగియనుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లలో బారులుతీరారు.

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 32 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com