ఏపీలో ఎస్సై పరీక్ష ఫలితాల విడుదల
- December 07, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మెయిన్ పరీక్ష తుది ఆన్సర్ కీని కూడా బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఏపీ వ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న జరిగిన ప్రాథమిక రాత పరీక్షకు 1,51,288 మంది హాజరవగా వారిలో 57,923మంది క్వాలిఫై అయ్యారు. అనంతరం జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయిన 31,193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహించి తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









