తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు..
- December 12, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పలు విభాగాల్లో అధికారుల బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సీపీలు వీరే..
హైదరాబాద్ సీపీ : కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
సైబరాబాద్ సీపీ : అవినాశ్ మహంతి
రాచకొండ సీపీ : సుధీర్ బాబు
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ : సందీప్ శాండిల్యా
ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీగా ఉన్న దేవేంద్ర చౌహాన్ లను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







