యూఏఈ ఆస్పత్రిలో ఇద్దరు గాజా పేషంట్లు మృతి

- December 27, 2023 , by Maagulf
యూఏఈ ఆస్పత్రిలో ఇద్దరు గాజా పేషంట్లు మృతి

యూఏఈ: గాజాకు చెందిన ఇద్దరు వృద్ధ క్యాన్సర్ రోగులు మంగళవారం మరణించినట్లు యూఏఈ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. ఇద్దరు రోగులు చివరిదశ క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని పేర్కొంది. మృతుల్లో ఒకరు 58, మరొకరు 63 ఏళ్ల వయసు వారని పేర్కొంది. వారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాని తెలిపారు. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించిన మానవతా చొరవలో భాగంగా  గాజా స్ట్రిప్ నుండి  వచ్చిన వందలాది మంది బాధితులకు యూఏఈలోని వివిధ ఆసుపత్రులలో అత్యవసర వైద్య చికిత్సలను అందజేస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com