ఖతర్లో ఉపాధి అవకాశాలు..జనవరి 5న ఇంటర్వ్యూలు
- December 30, 2023
హైదరాబాద్:నిరుద్యోగులకు ఖతార్లో ఉపాధి కల్పించడానికి కంపాస్ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలోని ప్రముఖ కన్సల్టెన్సీ జీటీఎం సంస్థ ఆధ్వర్యంలో జనవరి 5న నిజామాబాద్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. 21 ఏళ్ల వయస్సు నిండి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఇంగ్లిష్ భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈసీఎన్ఆర్ పాస్పోర్టుతో పాటు ఎలాంటి పచ్చబొట్టు లేని యువకులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జీటీఎం కన్సల్టెన్సీ కార్యాలయాల్లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి.
అయితే, ఎవరికీ ఒరిజినల్ పాస్పోర్టులు, డబ్బులు ఇవ్వకూడదని జీటీఎం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చీటీ సతీశ్రావు సూచించారు. అభ్యర్థులు ఆర్మూర్, నిజామాబాద్, జగిత్యా ల్, హైదరాబాద్లలో ఉన్న తమ కన్సల్టెన్సీ కార్యాలయాల్లో బయోడేటా సమర్పించి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి టోకెన్ తీసుకోవాలన్నారు. కేటరింగ్ సపోర్టు సర్వీసులలో ఉపాధి కల్పించడానికి ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో అనేకమందికి యూఏఈలో ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







