ఖతర్లో ఉపాధి అవకాశాలు..జనవరి 5న ఇంటర్వ్యూలు
- December 30, 2023
హైదరాబాద్:నిరుద్యోగులకు ఖతార్లో ఉపాధి కల్పించడానికి కంపాస్ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలోని ప్రముఖ కన్సల్టెన్సీ జీటీఎం సంస్థ ఆధ్వర్యంలో జనవరి 5న నిజామాబాద్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. 21 ఏళ్ల వయస్సు నిండి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఇంగ్లిష్ భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈసీఎన్ఆర్ పాస్పోర్టుతో పాటు ఎలాంటి పచ్చబొట్టు లేని యువకులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జీటీఎం కన్సల్టెన్సీ కార్యాలయాల్లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి.
అయితే, ఎవరికీ ఒరిజినల్ పాస్పోర్టులు, డబ్బులు ఇవ్వకూడదని జీటీఎం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చీటీ సతీశ్రావు సూచించారు. అభ్యర్థులు ఆర్మూర్, నిజామాబాద్, జగిత్యా ల్, హైదరాబాద్లలో ఉన్న తమ కన్సల్టెన్సీ కార్యాలయాల్లో బయోడేటా సమర్పించి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి టోకెన్ తీసుకోవాలన్నారు. కేటరింగ్ సపోర్టు సర్వీసులలో ఉపాధి కల్పించడానికి ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో అనేకమందికి యూఏఈలో ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









