ఖతర్లో ఉపాధి అవకాశాలు..జనవరి 5న ఇంటర్వ్యూలు
- December 30, 2023
హైదరాబాద్:నిరుద్యోగులకు ఖతార్లో ఉపాధి కల్పించడానికి కంపాస్ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలోని ప్రముఖ కన్సల్టెన్సీ జీటీఎం సంస్థ ఆధ్వర్యంలో జనవరి 5న నిజామాబాద్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. 21 ఏళ్ల వయస్సు నిండి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఇంగ్లిష్ భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈసీఎన్ఆర్ పాస్పోర్టుతో పాటు ఎలాంటి పచ్చబొట్టు లేని యువకులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జీటీఎం కన్సల్టెన్సీ కార్యాలయాల్లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి.
అయితే, ఎవరికీ ఒరిజినల్ పాస్పోర్టులు, డబ్బులు ఇవ్వకూడదని జీటీఎం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చీటీ సతీశ్రావు సూచించారు. అభ్యర్థులు ఆర్మూర్, నిజామాబాద్, జగిత్యా ల్, హైదరాబాద్లలో ఉన్న తమ కన్సల్టెన్సీ కార్యాలయాల్లో బయోడేటా సమర్పించి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి టోకెన్ తీసుకోవాలన్నారు. కేటరింగ్ సపోర్టు సర్వీసులలో ఉపాధి కల్పించడానికి ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో అనేకమందికి యూఏఈలో ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







