చిన్నారి మిస్సింగ్.. గంటల్లో అచూకీని కనుగొన్న పోలీసులు
- January 13, 2024
యూఏఈ: తన ఇంటి నుండి తప్పిపోయిన 14 ఏళ్ల బాలుడిని అజ్మాన్ పోలీసులు గంటల వ్యవధిలో అతని కుటుంబంతో కలిపారు. ఈ మేరకు సమగ్ర జుర్ఫ్ సెంటర్ దర్యాప్తు శాఖ డైరెక్టర్ కెప్టెన్ అహ్మద్ జాల్ అల్ రమీతి తన సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. బాలుడి తల్లిదండ్రుల నుండి సెంటర్కు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. తమ కుమారుడు తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడని, వెంటనే పోలీసు బృందాలు చిన్నారి కోసం వెతకడం ప్రారంభించాయని తల్లిదండ్రులు తెలిపారు. సెర్చ్ టీమ్ గంటల వ్యవధిలోనే బాలుడిని కనిపెట్టింది. పోలీసులు చిన్నారి తండ్రిని సంప్రదించి బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని సమాచారం అందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కెప్టెన్ అల్ రమీతి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







