విదేశాల్లో 'అయోధ్య' ప్రత్యక్ష ప్రసారాలు
- January 14, 2024
అమెరికా: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరపనున్న నేపథ్యంలో అమెరికాలోని పదికిపైగా రాష్ట్రాలలో రామమందిరానికి సంబంధించిన భారీ బిల్బోర్డులను 40కిపైగా ఏర్పాటు చేస్తున్నట్టు వీహెచ్పీ-అమెరికా ప్రధానకార్యదర్శి అమితాబ్ వీడబ్ల్యూ మిత్తల్ తెలిపారు.
ఇప్పటికే టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాలలో ఈ బోర్డులను ఏర్పా టు చేసినట్టు చెప్పారు. అరిజోనా, మిస్సోరీ రాష్ట్రాలలో ఈనెల 15వ తేదీన రామమందిర బిల్బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అమెరికాలోని హిందువులు భారీ కారు ర్యాలీలు నిర్వహించారు. అలాగే, ఆఫ్రికా ఖండంలోని మారిషస్ దేశంలో హిందువులైన ఉద్యోగులు ఈనెల 22న పూజల్లో పాల్గొనేందుకు రెండు గంటలు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ఆ దేశ కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
2011 జనాభా లెక్కల ప్రకారం మారిషస్ జనాభాలో హిందువులు దాదాపు 48.5 శాతం ఉన్నారు. కాగా, ఆ దేశ జనాభాలో 68ువరకు భారత సంతతికి చెందినవారే. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వచ్చే 10 రోజులు మారిష్సలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మారిషస్ సనాతన ధర్మ టెంపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఘూర్బిన్ భోజ్రాజ్ తెలిపారు. వీధుల్లో ర్యాలీలు, చారిత్రక, ముఖ్యమైన భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు ముఖ్యమైన కూడళ్లలో ఎల్సీడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి మందిర ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. ఈనెల 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ రామాలయ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు మారిషస్ సీనియర్ మంత్రి అంజివ్ రామ్ధన్య చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రమిదలు కూడా వెలిగించనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









