'ప్రతినిధి-2' టీజర్ లాంచ్ చేసిన చిరంజీవి
- March 30, 2024
హైదరాబాద్: ప్రముఖ టీవీ జర్నలిస్టు మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ప్రతినిధి-2. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి నేడు లాంచ్ చేశారు. ప్రతినిధి-2 చిత్రబృందం నేడు చిరంజీవి నివాసానికి వెళ్లింది.
దర్శకుడు మూర్తి, హీరో నారా రోహిత్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతినిధి-2 చిత్ర విశేషాలను మూర్తి, నారా రోహిత్... చిరంజీవికి వివరించారు. అనంతరం ఆయన లాప్ టాప్ ద్వారా టీజర్ ను ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మూర్తి... చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు.
టీజర్ చూస్తే పక్కా పొలిటికల్ చిత్రమని అర్థమవుతోంది. వానర ఎంటర్టయిన్ మెంట్స్, రాణా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ప్రతినిధి-2 చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







