'ప్రతినిధి-2' టీజర్ లాంచ్ చేసిన చిరంజీవి
- March 30, 2024హైదరాబాద్: ప్రముఖ టీవీ జర్నలిస్టు మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ప్రతినిధి-2. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి నేడు లాంచ్ చేశారు. ప్రతినిధి-2 చిత్రబృందం నేడు చిరంజీవి నివాసానికి వెళ్లింది.
దర్శకుడు మూర్తి, హీరో నారా రోహిత్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతినిధి-2 చిత్ర విశేషాలను మూర్తి, నారా రోహిత్... చిరంజీవికి వివరించారు. అనంతరం ఆయన లాప్ టాప్ ద్వారా టీజర్ ను ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మూర్తి... చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు.
టీజర్ చూస్తే పక్కా పొలిటికల్ చిత్రమని అర్థమవుతోంది. వానర ఎంటర్టయిన్ మెంట్స్, రాణా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ప్రతినిధి-2 చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!