ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- May 17, 2024
అమరావతి: ఏపీలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం 13 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీపీ వినీత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో సిట్ పని చేయనుంది. సీఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు
SIT సభ్యులు...
- ఏసీబీ ఎస్పీ రమాదేవి
- ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత
- ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి
- సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు
- ఏసీబీ డీఎస్పీ (ఒంగోలు) వల్లూరి శ్రీనివాస రావు
- ఏసీబీ డీఎస్పీ (తిరుపతి) రవి మనోహర చారి
- గుంటూరు రేంజ్ ఇన్ స్పెక్టర్ వి.భూషణం
- విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ కే.వెంకటరావు
- ఏసీబీ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ
- ఏసీబీ ఇన్ స్పెక్టర్ జీఐ. శ్రీనివాస్
- ఒంగోలు పీటీసీ మోయిన్
- అనంతపురం ఏసీబీ ప్రభాకర్
- ఏసీబీ ఇన్ స్పెక్టర్ శివ ప్రసాద్
పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ చేయనుంది. ఆయా ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించనుంది. ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి తగిన ప్రతిపాదనలు చేయనుంది. అవసరమైన చోట కొత్తగా ఎఫ్ఐఆర్ ల నమోదుకు సూచనలు చేయనుంది సిట్. రెండు రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సిట్ నివేదిక ఆధారంగా హింసాత్మక ఘటనల వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోనుంది సీఈసీ.
తాజా వార్తలు
- మంటల్లో చైనా డ్రైవర్లెస్ కారు.. అబుదాబిలో ప్రాజెక్టుపై ప్రభావం ఉంటుందా..?
- సఖిర్ పర్యావరణ వ్యవస్థ రక్షణ..7,600 టన్నుల వ్యర్థాల తొలగింపు..!!
- మే 20 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరం..!!
- సౌదీ విమానాశ్రయాలలో 15శాతం పెరిగిన ప్రయాణీకులు..!!
- కువైట్ లో జూన్ 1 నుండి ఔట్ డోర్ వర్క్ పై ఆంక్షలు..!!
- విహారంలో ప్రమాదం..13 మందిని రక్షించిన యూఏఈ నేషనల్ గార్డ్..!!
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి