దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆంక్షలు

- July 06, 2024 , by Maagulf
దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆంక్షలు

దుబాయ్: జూలై 6 నుండి 17 వరకు వేసవి సెలవుల ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) విమానాశ్రయం.. ప్రయాణికులు కాని వారి కోసం కొన్ని పరిమితులను ప్రకటించారు. యూఏఈలోని పాఠశాలలు జూలై, ఆగస్టులలో వేసవి సెలవులు ఉంటాయి.   పీక్ పీరియడ్‌లలో టెర్మినల్స్‌లో ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులను ఎయిర్‌పోర్టుకు దించే వారు తమ వీడ్కోలు ఇంట్లోనే చెప్పాలని అధికారులు సూచించారు. టెర్మినల్స్ 1 మరియు 3 రెండింటిలోనూ అరైవల్ ఫోర్‌కోర్టులకు యాక్సెస్ ప్రజా రవాణా మరియు అధీకృత విమానాశ్రయ వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు.  

DXB జూలై 6 నుండి 17 వరకు ట్రాఫిక్‌లో "గణనీయ పెరుగుదల" చూస్తుంది. మొత్తం 3.3 మిలియన్ల మంది అతిథులు దాని టెర్మినల్స్ ద్వారా వచ్చివెళతారు. ఈ కాలంలో, 914,000 మంది ప్రయాణికులు DXB నుండి బయటికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూలై 12-14 వారాంతంలో ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, DXB 840,000 మంది ప్రయాణీకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని, ఇది అత్యంత రద్దీగా ఉండే వారాంతం అవుతుందని అధికారులు తెలిపారు.  మరోవైపు ఫ్లై దుబాయ్ ప్రయాణీకులు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు రావాలని సూచించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com