మస్కట్: గ్రీన్ ఎనర్జీపై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం అదనపు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జి) రైలును అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికను ప్రకటించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోని కల్హాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో సంవత్సరానికి 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం (MTPA) కలిగి ఉంది. వ్యూహాత్మక విస్తరణ ఒమన్ LNG ఉత్పత్తిని 15.2 MTPAకి పెంచనుంది. ఈ కొత్త LNG రైలు ప్రాజెక్ట్ కోసం ఫ్రంట్-ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ (FEED) అధ్యయనాన్ని ఖరారు చేయడంలో ప్రభుత్వం ఇప్పుడు ముందడుగు వేసిందని ఇంధనం మరియు ఖనిజాల శాఖ మంత్రి సేలం అల్ ఔఫీ వెల్లడించారు. ఎల్ఎన్జి ప్రాజెక్ట్ ను 2029 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.