అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్..
- August 16, 2024
అమరావతి: టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేశ్ అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో ఏర్పాటు చేసిన క్యాంటిన్ ను లోకేశ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఆయనే స్వయంగా పలువురికి అల్పాహారంను వడ్డించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లను పున: ప్రారంభిస్తుంది. తొలి విడతలో భాగంగా 100 క్యాంటిన్లు ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
శుక్రవారం రాష్ట్రంలోని మరో 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నులకపేటలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. అన్న క్యాంటిన్లలో రూ.5కే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 35వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం 35వేల మందికి, రాత్రి మరో 35 వేల మంది భోజనం అందించనున్నారు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









