అబుదాబి నుండి భారత నగరాలకు 3 కొత్త డైరెక్ట్ ఫైట్స్..!
- August 21, 2024
యూఏఈ: ఇప్పుడు అబుదాబి నుండి నేరుగా మూడు భారతీయ నగరాలైన మంగళూరు (IXE), తిరుచిరాపల్లి (TRZ), కోయంబత్తూర్ (CJB) లకు వెళ్ళవచ్చు. ఈ మేరకు యూఏఈ క్యాపిటల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. జాయెద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (AUH) నుండి అదనపు డైరెక్ట్ విమానాలను బడ్జెట్ క్యారియర్ ఇండిగో నిర్వహిస్తుందని, ఇది ఇప్పుడు ఎమిరేట్ నుండి భారతీయ నగరాలకు 13 మార్గాలను నడుపుతుందని అబుదాబి ఎయిర్పోర్ట్స్ తెలిపింది. వ్యాపారాల కోసం కొత్త మార్గాలను తెరవడం, ఇండిగోతో మా విజయవంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించడం అని ఏవియేషన్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ నథాలీ జోంగ్మా అన్నారు. అబుదాబి ఎయిర్పోర్ట్స్ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ప్రయాణీకుల సంఖ్యలో 33.5 శాతం పెరుగుదల నమోదైంది. ఇండిగోలో విమానాశ్రయ కార్యకలాపాలు, కస్టమర్ సేవలకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ మాట్లాడుతూ..జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ ప్రపంచ స్థాయిని మరింత పెంచడానికి, మెరుగైన కనెక్టివిటీకి తలుపులు తెరిచేందుకు, తమ వినియోగదారులకు మరిన్ని ప్రయాణ ఎంపికలను అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









