ఆషాఢమాస బోనాల ఉత్సవాలను 22 ఆలయాల్లో...
- June 21, 2016
హైదరాబాద్ నగరం పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బోనాల షెడ్యూల్ ను విడుదల చేసింది. కమిటీ సభ్యులు ఈ యేడాది ఆషాఢమాస బోనాల ఉత్సవాలను 22 ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్వహించే కైంకర్యాలను నిర్వాహకులు తెలియజేశారు.ఇందులో భాగంగా జూలై 22న ఉదయం కలశస్థాపన, ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందన్నారు. 23న సహస్ర అక్షితార్చన, 24న ఘట స్థాపన, 25న లక్ష భిల్వార్చన, 26న పలు కార్యక్రమాలతో పాటు 27న దీపోత్సవం, తీపి వంటకాలతో అమ్మవారికి ఛప్పన్ భోగ్ నిర్వహిస్తారు. 28న లక్ష పుష్పార్చన, 29న లక్ష కుంకుమార్చన, 30న చండీహవనంతోపాటు తొట్టెల స్వాగతం, అర్ధరాత్రి పొట్టేళ్లతో ఆహార ఊరేగింపు నిర్వహించి బలిగంప పూర్తిచేస్తారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







