తొలిసారి రుషికొండ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు..
- November 02, 2024
విశాఖపట్నం: విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లిలో శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు రుషికొండ వెళ్లారు.రుషికొండలో నిర్మించిన భవనాలను చంద్రబాబు పరిశీలించారు.ప్యాలెస్ లో తిరుగుతూ నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు చంద్రబాబు.ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కార్యక్రమాలకు వాడుకోవాలి అనే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.దానికి సంబంధించి భవనాలను పరిశీలించాలని చంద్రబాబు అనుకున్నారు.ఇందులో భాగంగానే ఇవాళ ఆయన రుషికొండ చేరుకున్నారు. అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు.ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
ఈ భవనాలను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించింది. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. రుషికొండను మొత్తం తవ్వేసి నిర్మాణాలు చేస్తున్నారని వివాదం చెలరేగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రుషికొండ భవనాల వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఇప్పుడు ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేదానిపై చంద్రబాబు సర్కార్ సమాలోచనలు చేస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







