తొలిసారి రుషికొండ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు..
- November 02, 2024
విశాఖపట్నం: విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లిలో శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు రుషికొండ వెళ్లారు.రుషికొండలో నిర్మించిన భవనాలను చంద్రబాబు పరిశీలించారు.ప్యాలెస్ లో తిరుగుతూ నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు చంద్రబాబు.ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కార్యక్రమాలకు వాడుకోవాలి అనే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.దానికి సంబంధించి భవనాలను పరిశీలించాలని చంద్రబాబు అనుకున్నారు.ఇందులో భాగంగానే ఇవాళ ఆయన రుషికొండ చేరుకున్నారు. అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు.ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
ఈ భవనాలను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించింది. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. రుషికొండను మొత్తం తవ్వేసి నిర్మాణాలు చేస్తున్నారని వివాదం చెలరేగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రుషికొండ భవనాల వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఇప్పుడు ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేదానిపై చంద్రబాబు సర్కార్ సమాలోచనలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







