తొలిసారి రుషికొండ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు..
- November 02, 2024
విశాఖపట్నం: విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన గుంతలు పూడ్చే కార్యక్రమానికి అనకాపల్లిలో శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు రుషికొండ వెళ్లారు.రుషికొండలో నిర్మించిన భవనాలను చంద్రబాబు పరిశీలించారు.ప్యాలెస్ లో తిరుగుతూ నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు చంద్రబాబు.ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ కార్యక్రమాలకు వాడుకోవాలి అనే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.దానికి సంబంధించి భవనాలను పరిశీలించాలని చంద్రబాబు అనుకున్నారు.ఇందులో భాగంగానే ఇవాళ ఆయన రుషికొండ చేరుకున్నారు. అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు.ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
ఈ భవనాలను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయలతో గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలో ఈ విలాసవంతమైన భవనాలను నిర్మించింది. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. రుషికొండను మొత్తం తవ్వేసి నిర్మాణాలు చేస్తున్నారని వివాదం చెలరేగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రుషికొండ భవనాల వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఇప్పుడు ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేదానిపై చంద్రబాబు సర్కార్ సమాలోచనలు చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









