జీడీపప్పును తీసుకునే ముందు షుగర్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
- November 04, 2024
జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటుంది.అదే విధంగా, ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.అయితే, అందులో రక్తంలో చక్కెర స్థాయిలను ఎఫెక్ట్ చేసే కార్బోహైడ్రేట్స్, కేలరీలు కూడా ఉంటాయి. కాబట్టి, షుగర్ ఉన్నవారు జీడిపప్పు తినొచ్చా లేదా అనేది చాలా మందిని కన్ఫ్యూజన్ పెట్టే విషయం. జీడిపప్పులో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, షుగర్ ఉన్నవారు ఈ జీడిపప్పు తినొచ్చా.. లేదా అనే విషయాలను తెలుసుకోండి.
షుగర్ ఉన్నవారు జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.దీంతో గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి.అమి మీ రక్త నాళాలకి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటాయి.గుండెజబ్బు అనేది షుగర్ ఉన్నవారికి వచ్చే సాధారణ సమస్య. కాబట్టి, జీడిపప్పులు తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
జీడిపప్పులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, స్పైక్స్ని నిరోధిస్తాయి. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఇందులోని ఫైబర్ కారణంగా కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ, శోషణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో రక్తంలో ఒకేసారిగా స్పైక్స్ పెరగవు.ఫైబర్ ఎక్కువసేపు కడుపుని నిండుగా ఉంచడంలో హెల్ప్ ఆకలి, క్రేవింగ్స్ని తగ్గిస్తుంది.దీంతో బరువు పెరగడం వంటి సమస్యలు కూడా ఉండవు.
జీడిపప్పులో కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి మిగతా నట్స్ కంటే చాలా ఎక్కువ. మీరు జీడిపప్పులు తింటే రోజువారీ కేలరీలు, కార్బోహైడ్రేట్స్ అవసరాలను తీర్చినట్టే. అయితే, వీటిని తక్కువగా తినాలి. అదే విధంగా, వీటిని ప్లెయిన్గానే తీసుకోవాలి.అంతేకానీ, ఉప్పు, చక్కెర వేసి ఫ్రై చేసినవి తీసుకోకూడదు.దీని వల్ల హైబీపి, రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.కాబట్టి, మీరు నేచురల్గా తినాలి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







