సౌదీ అరేబియాలో1,238 మంది ఫారీన్ ఇన్వెస్టర్లకు ప్రీమియం రెసిడెన్సీ..!!
- November 26, 2024
రియాద్: సౌదీ అరేబియా ప్రీమియం రెసిడెన్సీని పొందిన విదేశీ పెట్టుబడిదారుల సంఖ్య 1,238కి చేరుకుందని సౌదీ పెట్టుబడుల మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించిన ఏడాది లోపే ఈ మైలురాయికి చేరుకుందన్నారు. సోమవారం రియాద్లో జరిగిన ప్రపంచ పెట్టుబడి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 30 దేశాల నుంచి 2,500 మంది పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.విజన్ 2030 ప్రారంభించినప్పటి నుండి పెట్టుబడి వాతావరణం, దాని పురోగతిని అల్-ఫాలిహ్ వివరించారు. స్థూల దేశీయోత్పత్తి (GDP) రేటు 70 శాతం పెరుగుదలను నమోదు చేసిందని, అదే కాలంలో $1.1 ట్రిలియన్లకు చేరుకుందని తెలిపారు. ఇందులో 50శాతానికిపైగా చమురుయేతర రంగాల నుండి వస్తుందని పేర్కొన్నారు.
జనవరి 2024లో సౌదీ అరేబియా తన ప్రవాస నివాస చట్టానికి అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఇది పెట్టుబడిదారులు, ప్రతిభావంతుల వర్గాలకు ప్రీమియం రెసిడెన్సీని అందజేస్తుంది. దానితో పాటు కుటుంబ సభ్యులకు ప్రీమియం రెసిడెన్సీ, ప్రవాస చెల్లింపు నుండి మినహాయింపు, డిపెండెంట్ల రుసుములు, వీసా రహిత ప్రయాణం, స్పాన్సర్ అవసరం లేకుండానే రియల్ ఎస్టేట్ను కలిగి ఉండి వ్యాపారాన్ని నిర్వహించే హక్కు, రాజ్యానికి ఎగ్జిట్, రీఎంట్రీ విధానాలలో సౌలభ్యం పాటు, రుసుము లేకుండా సంస్థల మధ్య సేవల బదిలీలు, బంధువులకు ఆతిథ్యం ఇవ్వడం వంటి అనేక ప్రయోజనాలు ప్రవేశపెట్టింది. అలాగే అన్ని అర్హతలు కలిగిన స్వీయ-ప్రాయోజిత పథకం ద్వారా విదేశీ పౌరులు ఒక సంవత్సరం వరకు నివాస అనుమతిని పొందేందుకు అనుమతించారు. అన్ని జాతీయతలకు చెందిన వ్యక్తులు కొత్త ప్రీమియం రెసిడెన్సీ ఉత్పత్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికార యంత్రాంగం ప్రకటించింది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







