అజ్మాన్లో ‘ఫోన్ స్కామ్’..15 మంది ముఠా అరెస్ట్..!!
- December 29, 2024
యూఏఈ: అజ్మాన్లో "ఫోన్ స్కామ్" కేసులో 15 మంది వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఆసియా జాతీయుల ముఠా ఇతరులను ట్రాప్ చేస్తుందని, తద్వారా వారి బ్యాంకు వివరాలు లేదా వారి ID వంటి అధికారిక పత్రాలను అప్డేట్ చేయమని కోరుతూ, అధికారుల వలే నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
నకిలీ డేటా, డాక్యుమెంట్లతో నమోదైన ఫోన్ కార్డుల నుంచి వచ్చిన కాల్స్పై ఫిర్యాదులు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు అనంతరం మోసానికి పాల్పడుతున్న ముఠాను గుర్తించి, వారి వద్ద నుండి 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అజ్మాన్ పోలీస్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ నుయిమి తెలిపారు. ఇలాంటి కాల్లను నమ్మవద్దని, వాటిని నివేదించడానికి వెనుకాడవద్దని అల్ నుయిమీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయమని బ్యాంకులు అడగవని తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు ఈ ఫేక్ కాల్స్ , మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల ద్వారా మాత్రమే డేటాను అప్డేట్ చేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







